“ఎవరు ఏమైపోతే మాకేం”కథా నేపధ్యం:

ఏప్రియల్ 18, 2008

ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన మణిపూర్‌లో మానవ కల్పితమైన అనేక సమస్యలలో ఒకదాని చుట్టూ అల్లిన కథ ఇది. రోజూవారీ అవసరాలకి కావల్సిన అన్ని వస్తువులను మణిపూర్‌కి చేర్చాలంటే 39 నెంబరు నేషనల్ హైవే ద్వారానే రవాణా చేయాలి. ఈ కొండదారి తప్ప రవాణాకి మరో మార్గం లేదు. ఇంఫాల్ చేరాలంటే, ఘాట్‌రోడ్ మీదుగా నాగాలాండ్ గుండా ప్రయాణించాల్సుంటుంది. వ్యూహాత్మకమైన ఈ ప్రాంతాన్ని ఆసరగా చేసుకున్న కొన్ని సంఘ విద్రోహక శక్తులు దారి కాచి వాహనాల నుంచి డబ్బులు గుంజుతుంటారు. ఇదేకాక, కొంత మంది స్వార్ధపరులు తమ గొంతెమ్మ కోర్కెల సాధన కోసం తరచూ ఈ ప్రాంతంలో రోజుల తరబడి రాస్తారోకోలు నిర్వహించి వేలాదిమందికి ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ప్రయాణీకుల, లారీ డ్రైవర్ల గోడు ఎవరికీ పట్టదు……. అటువంటి ఓ లారీ డ్రైవరు కుటుంబం కథే “ఎవరు ఏమైపోతే మాకేం” 

Entry Filed under: కథల నేపధ్యం/వివరాలు. ట్యాగులు: , .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


Blog Stats

ఇటీవలి జాబులు

ఇటీవలి అభిప్రాయములు

Madhu Janjur on “అమృత వర్…
Krant hi on నా గురించ…
కొల్లూ… on విచారగ్రస్…
phani pradeep on విచారగ్రస్…

వర్గములు:

Blogroll

ఖజానాలు