ది 7 ఏప్రిల్ 2008 నాడు ప్రముఖ హిందీ వెబ్‌జైన్ “అభివ్యక్తి” నేను తెలుగు నుంచి అనువదించిన  ఓ చక్కని కథని ప్రచురించింది.  మూల కథని తెలుగులో శ్రీ మాన్యం రమేష్ కుమార్ రాసారు.

శబ్దం” అనే పేరు గల ఈ కథ ది.4 మార్చ్ 2007 నాతి ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం లో ప్రచురితమైంది. 
కుటుంబ విలువలు లుప్తమవుతున్న నేటి కాలంలో, ఓ కుటుంబంలో తండ్రి ఆరోగ్యం కోసం కొడుకు,కోడలు; కొడుకు ఆర్ధిక భద్రత కోసం ఆ పెద్దాయన ఏ విధంగా ప్రవర్తించారనే కథ వస్తువుతో,చక్కని మానసిక సంవేదనలతో అల్లిన కథ ఇది. ఇందుకు రమేష్ కుమార్ గారు అభినందనీయులు. ఇంత చక్కని కథని హిందీలో అనువదించేందుకు నాకు అనుమతినిచ్చినందుకు వారికి నా నెనరులు.

మూల కథని, దానికి నా అనువాదన్ని పై లింక్‌లలో చదివి మీ అభిప్రయాలు తెలియజేయండి.